Type Here to Get Search Results !

From The Desk of Principal Secretary School Education Programme YouTube Live

  From The Desk of Principal Secretary School Education Programme YouTube Live 

గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి మొదటి వీడియోలోని సందేశం



 First Video Direct Link : https://youtu.be/jJWGVENhAes

నేను డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనే కార్యక్రమాన్ని నిర్వహించదల్చుకున్నాను. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే మన ప్రభుత్వానికి విద్యారంగానికి సంబంధించి ఉన్న ఆలోచన సరళి ఏమిటి? అదే ఆలోచన సరళిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి ఎకడమిక్ సిబ్బంది మరియు నాన్ ఎకడమిక్ సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరూ కలిసి పనిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మరియు ప్రభుత్వం యొక్క నిర్దేశిత లక్ష్యాలను ఎలా సాధించగలము అనేది వివరించదల్చుకున్నాను. మనం భౌతిక శాస్త్రంలో అనునాదం గురించి నేర్చుకున్నాము. అదేవిధంగా మనలో ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలు ఒకే ఫ్రీక్వెన్సీ ఉన్నట్లయితే మనము ఫలితాలను మరింత వేగవంతముగా ప్రభావవంతముగా పొందగలము.

విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గా సెక్రటేరియట్ లోను విభాగాధిపతుల కార్యాలయాలలోనూ క్షేత్ర పర్యటనలలోనూ విద్యాశాఖ పనితీరును సమీక్షించటం జరుగుచున్నది క్షేత్ర పర్యటనలలో నా యొక్క అనుభవాలను మీతో పంచుకోవడం కోసం ఇకపై ప్రతినెల చివరి వారంలో ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనే కార్యక్రమాన్ని నిర్వహించటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు గ్రామ సచివాలయాల్లోని విద్యాశాఖకు సంబంధించిన సిబ్బంది మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది ఉప విద్యాశాఖ అధికారుల కార్యాలయ సిబ్బంది జిల్లా విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది రీజనల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయ సిబ్బంది విద్యాశాఖ కమిషన్ రేట్ సిబ్బంది సెక్రటేరియట్ సిబ్బంది అందరూ భాగస్వాములుగా ఉండాలి.

ఈ మొదటి వీడియోలో ఐదు అంశాల గురించి మీతో చర్చిస్తాను.

మొదటి అంశం: TAB ల వినియోగం
గత 20 నుండి 25 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా బోధనాభ్యాసనలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం అభివృద్ధి చెందుతూ వస్తుంది అయితే మరి ఏ ఇతర దేశంలోనూ లేని విధంగా, మనదేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధముగా ఒకేసారి 4లక్షల 60 వేల మంది 8వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మరియు 60 వేల మంది ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు TAB లను అందించటం జరిగింది. వీటి యొక్క వినియోగానికి సంబంధించి నాలుగు అంశాలను మనం చూసినట్లయితే మొదటగా సాంసంగ్ కంపెనీ వారికి చెందిన నాణ్యమైన ఆకర్షణీయమైన TAB లను విద్యార్థులకు అందించాము వాటికి భద్రత కలిగిన SD కార్డులను ఏర్పాటు చేసాము BY JUS వారి నాణ్యమైన కంటెంట్ ను విద్యార్థులకు అందించాము. పై చర్యల ద్వారా మనం కేవలం 50 శాతం లక్ష్యాన్ని మాత్రమే సాధించగలిగాము మిగిలిన 50 శాతం వాటి వినియోగంపై ఆధారపడి ఉంది. ఇది ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు మాత్రమే సాధించగలరు. విద్యార్థులకు ట్యాబుల యొక్క వినియోగం గురించి 21 రోజులు చెప్పినట్లయితే అది వారికి అలవాటుగా మారుతుంది అదే విద్యార్థులకు 90 రోజులపాటు టాబుల వినియోగం గురించి చెప్పినట్లయితే వారు ట్యాబుల వినియోగాన్ని తమ జీవన శైలిగా మార్చుకొనగలరు.

రెండవ అంశం: బైలింగ్యువల్ పాఠ్యపుస్తకాలు
మనదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో రెట్టింపు ఖర్చుతోటైలింగ్యువల్ పాఠ్యపుస్తకములను ముద్రించటం జరిగినది. గత మూడు సంవత్సరాలుగా ఈ పుస్తకాలను మనం విద్యార్థులకు అందిస్తున్నాము

ఫార్మేటివ్ అసెస్మెంట్ మరియు సమ్మేటివ్ అసెస్మెంట్ యొక్క ప్రశ్న పత్రములను సైతం రెండు భాషల్లో ముద్రిస్తున్నాము అయినప్పటికీ కొద్దిమంది విద్యార్థులు మాత్రమే మ్యాథమెటిక్స్ లేదా సైన్సెస్ ఆంగ్ల భాషను అందుకోగలుగుతున్నారు నాలుగో తరగతి నుండి 8వ తరగతి వరకు మనం టార్గెట్గా ఉంచుకొని మనం పని చేయవలసి ఉంది.

మూడవ అంశం: జగనన్న విద్యా కానుక
దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1000 కోట్లకు పైగా ఖర్చుపెట్టి స్కూల్ బ్యాగ్ బూట్లు నోట్ పుస్తకములు బెల్టు వంటి పది రకాలకు పైగా వస్తువులను మనం విద్యార్థులకు అందిస్తున్నాము నేను ఇటీవల 20 కిలోమీటర్ల దూరంలోని ఒక పాఠశాలను సందర్శించినప్పుడు ఆ పాఠశాలలోని ఏ ఒక్క విద్యార్థి కూడా బూట్లు ధరించి గాని లేదా బెల్టును ధరించి గాని కనిపించలేదు ఇది బాధాకరమైన విషయం కనుక ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు అందరూ ప్రతి రోజు విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా జగనన్న విద్యా కానుక ద్వారా అందించబడిన వస్తువులను ఉపయోగించే అలవాటును విద్యార్ధులలో పెంపొందించాలి.

నాలుగవ అంశం: జగనన్న గోరుముద్ద
కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలతో గాని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకానికి రెట్టింపుకు పైగా వ్యయం జరుగుచున్నది. జగనన్న గోరుముద్ద పథకాన్ని సక్రమంగా నిర్వహించాలంటే ఆ పథకానికి అవసరమైన గుడ్లు చిక్కీ ల వివరాలు ఎప్పటికప్పుడు మనము యాప్ లో అప్లోడ్ చేయాలి అప్పుడే మనకు అవసరమైన ఇండెంట్ జనరేట్ అవుతుంది మనము సకాలంలో విద్యార్థులకు అందించగలము.

ఐదవ అంశము: నాడు నేడు
నాడు నేడు పథకంపై గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగింది. మనదేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన ఈ పథకం ద్వారా జరుగుచున్నది. ఈ పథకం ద్వారా పాఠశాలలో నిర్వహింపబడే టాయిలెట్ల మెయింటెనెన్స్, ఆర్ వో సిస్టమ్స్, బెంచీలు సక్రమంగా మెయింటెనెన్స్ జరగాలి. మండల విద్యాశాఖ అధికారులు, ఉప విద్యాశాఖ అధికారులు దీనిపై దృష్టి సారించాలి.

అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు
మీ
ప్రవీణ్ ప్రకాష్ ప్రిన్సిపల్ సెక్రెటరీ


గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి రెండవ వీడియోలోని ముఖ్య అంశములు


 2nd Video Direct Link : https://youtu.be/Sz9gO7kIwYU


అభ్యసన ప్రక్రియలలో transaction అనేది ప్రధాన అంశము. ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు మధ్యన ఈ ప్రక్రియ సక్రమంగా జరగాలి దీనిలోని ముఖ్యాంశములు...

1. సిలబస్:- తగిన సమయానికి సిలబస్ పూర్తి చేయబడాలి. విద్యా సంవత్సరంలోని 220 రోజులకు గాను ఈ ప్రణాళిక సక్రమంగా అమలు జరగాలి.

2.Notes by Students:- విద్యార్థులు రాసుకున్న పుస్తకాలను ఉపాధ్యాయులు ప్రతి పదాన్ని చదివి తప్పులను సరి చేయాలి ఒకటి నుండి 5వ తరగతి వరకు Work Books ఇవ్వబడ్డాయి. వీరికి నోట్ బుక్స్ లేవు ఎందుకంటే వర్క్ బుక్ నే నోట్ బుక్స్ గా పరిగణించాలి. నేను కొన్ని పాఠశాలలు సందర్శించినప్పుడు సిలబస్ విషయంలోనూ మరియు నోట్ బుక్స్ లేదా వర్క్ బుక్స్ కరెక్షన్ విషయంలో చాలా విషయాలు గమనించాను సిలబస్ పూర్తి చేయని ఉపాధ్యాయులను వర్క్ బుక్స్ ను కరెక్ట్ చేయని ఉపాధ్యాయులను చాలామందిని గమనించాను కొన్ని పాఠశాలలలో కనీసం ఒక్క పేజీని కూడా రాయించని పరిస్థితి గమనించాను. ఈ విషయంలో సూపర్వైజింగ్ అధికారులు నా విజిట్ నందు ప్రశ్నించబడతారు.

ఈ అంశాలను సక్రమంగా నెరవేర్చకపోతే ట్రాన్సాక్షన్ అనే ప్రక్రియ కుంటుపడుతుంది. ఉన్నత పాఠశాలల యందు 6 నుండి 10వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ లు విద్యార్థుల పట్ల ఖచ్చితమైన శ్రద్ధ వహించాలి దీనిని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలి.

రెండు ముఖ్యమైన అంశాలు తప్పనిసరిగా ఉండాలి 
  • 1. ఇంటరాక్టివ్ ఫ్లాగ్ ప్యానల్
  • 2. బైజూస్ కంటెంట్.. 8 నుండి 10వ తరగతి వరకు
ఇంటరాక్టివ్ ఫ్లాగ్ ప్యానెల్ లో అధికారులు క్రింది స్థాయి అధికారులతో మరియు ఉపాధ్యాయులతో పాఠశాల విజిట్ సందర్భంగా చర్చించి ప్రణాళికలు సక్రమంగా అమలు అయ్యే విధంగా బాధ్యత తీసుకోవాలి సమస్యలు పరిష్కరించాలి.

కంటెంట్ కు సంబంధించి ప్రతి ఉపాధ్యాయుడు బైజుస్ కంటెంట్ను తరచుగా చూసి రాబోయే విద్యా సంవత్సరానికి అనగా 2023 2024 విద్యాసంవత్సరానికి విద్యా వార్షిక ప్రణాళికలు బైజుస్ కంటెంట్కు అనుగుణంగా తయారు చేయాలి.

ప్రధానోపాధ్యాయులు కోడిగుడ్లు చిక్కీలు మొదలైన వాటి విషయంలో ఏదైనా తేడా ఉంటే యాప్ నందు టికెట్ రైజ్ చేయాలి.

క్వాలిటీ మరియు మెయింటెనెన్స్ ఈ రెండు విషయాలు అమలు అయ్యేలా చూడటం పంపిణీ చేయు అధికారుల యొక్క బాధ్యత వీటిలో ఏదైనా తేడా ఉన్న ఎడల టికెట్ రైజ్ చేయవచ్చును. దీనికి సంబంధించి డీఈవో, డిప్యూటీ ఈవో, ఎంఈఓ, ఇంజనీర్లు, వెల్ఫేర్ కార్పొరేషన్ సిబ్బంది బాధ్యులుగా పరిగణించబడతారు.

పై విషయాలను సక్రమంగా అమలు చేసి విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను.
ప్రవీణ్ ప్రకాష్ ప్రిన్సిపల్ సెక్రెటరీ

గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి మూడో వీడియోలోని సందేశం


3rd Video Direct Link : https://youtu.be/W-rr4cnXqPk

ఈ వీడియోలో రెండు అంశాలు కలవు
1. విధి నిర్వహణకు సంబంధించి,
2. డిజిటల్ ఎడ్యుకేషన్.

నేను ఉపాధ్యాయుల పనితీరులో పాఠశాలలో గమనించినటువంటి అంశాలు

1. సిలబస్ పూర్తి చేయకపోవటం,
2. సిలబస్ పూర్తి చేసి క్లాస్ వర్క్ పూర్తి చేయకపోవడం,
3. సిలబస్ పూర్తి చేసి క్లాస్ వర్క్ పూర్తి చేసి నోట్ బుక్స్ కరెక్షన్ చేయకపోవడం, 

4. యాంత్రికంగా సిలబస్ పూర్తి చేసి క్లాస్ వర్క్ పూర్తి చేసి కరెక్షన్ వర్క్ మెకానికల్ గా చేయడం టిక్కులు పెట్టడం తప్పులను సరిచేయకపోవడం, ఉపాధ్యాయుల కరెక్షన్ వర్క్ లో క్వాలిటీ లేకపోవడం.

మడకశిరలో పనిచేస్తున్న ఎస్జీటీ శోభా రాణి గారు అంకితభావంతో పనిచేసినట్లు పరిశీలనలో తెలిసినది.

శోభారాణి వంటి అంకిత భావం గల ఉపాధ్యాయులు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి కావాలి.

క్వాలిటీ ఆఫ్ కరేక్షస్ వర్క్ లో నా సూచనలు:-

1. ప్రతిరోజు కొన్ని నోట్స్ లు దిద్దాలి. వారానికి నెలకో కాకుండా ప్రతిరోజు విద్యార్థుల యొక్క తప్పులను సరిదిద్దాలి, కరెక్షన్ చేయాలి.

2. ఉపాధ్యాయులు అధికారుల పర్యటన గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు.

3. ఎవరి స్థాయిలో వారు హార్డ్ worked గా ఉండాలి. RJDSE, DEO, DYEO, MEO, HM, TEACHERS అందరూ తమ ధర్మాన్ని నిర్వర్తించాలి.

4. ప్రిన్సిపల్ సెక్రెటరీగా నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను.

5. దీనిలో ఎటువంటి పబ్లిసిటీకి అవకాశం లేదు. దయచేసి అర్థం చేసుకుని సహకరించండి.

విద్యా శాఖ యొక్క ప్రధాన కేంద్రం/లక్ష్యం ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య జరిగే అభ్యసన ప్రక్రియ.

Components of best policy(As per the best professor of the Masters in Public policy): Minimum gap between policy and implementation.

మనం అందరం policy కి ఆచరణకు మధ్య ఉన్న అంతరాన్ని క్షేత్ర స్థాయిలో సాధ్యమైనంత గా తగ్గించాలి. 
6. ప్రభుత్వం కోట్ల రూపాయలు విద్య మీద ఖర్చు చేస్తుంది. ప్రభుత్వ ఉద్దేశాన్ని క్రింది స్థాయి వరకు తీసుకు వెళ్ళవలసిన బాధ్యత మనందరి పై ఉన్నది.

7. నేను రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖకు రాయబారిని, సంధానకర్తను, నాయకుడను, ఛాంపియన్ ను.

8. ప్రభుత్వ పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత పి ఎస్ గా నాపై ఉన్నది. అదే నా ధర్మం నా బాధ్యత.

9. అందరిలో పాజిటివ్ థింకింగ్ రావాలి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో గ్యాప్ రాకూడదు. అందరూ సమన్వయంతో పని చేయాలి. లేకపోతే ప్రభుత్వ పథకాలు నీరుగారి పోతాయి.

సమస్యకు మూలాలు:-

లీనియర్ థింకింగ్ లేకపోవడం మరియు looking the work in different dimensions,

పనిచేయడం లో మల్టీ టాస్కింగ్ ....ఎందుకుచేయాలి...చెయ్యకపోతే ఎమి అవుతుంది.... లాంటి వ్యతిరేక దృక్పథం...వానిని విడనాడాలి. సకారత్మక దృక్పథం తో ముందుకు వెళ్లాలి.

రెండో అంశము డిజిటల్ ఎడ్యుకేషన్:-

ప్రభుత్వం కోట్ల రూపాయలతో 8 వ తరగతి విద్యార్థులకు టాబ్స్ పంపిణీ చేయడం జరిగింది. దాదాపు ఇందుకోసం 1800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం.

టాబ్స్ యూసేజ్ సక్రమంగా లేకపోవడం గమనించడం జరిగింది.

1. జిల్లా స్థాయి అధికారులకు ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అందరికీ ట్యాబ్ ఏ విధంగా

ఉపయోగించాలి అని తెలిసి ఉండాలి.

2. మనకే ట్యాబ్ ఉపయోగించడం ప్రావీణ్యం లేకపోతే విద్యార్థులకు ఎలా చెప్పగలుగుతాం. కనుక ప్రతి ఒక్కరికి టెక్నాలజీ పై అవగాహన ఉండాలి. ఈ ప్రభుత్వ ఉద్దేశం నెరవేరాలి.

3. అధికారులు కానీ కొంతమంది టీచర్లు అసలు ఒక్క పాఠం కూడా వీడియో కూడా చూడలేదు. శ్రీనివాస్ మాస్టారు, పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాల, గుడివాడ, అభినందనీయుడు.

బైజుస్ యాప్ నందు ఉన్న సంబంధిత సబ్జెక్ట్ కంటెంట్ ను పూర్తిగా చూడడం జరిగింది అని చెప్పారు. శ్రీనివాస్ లాంటి ఉపాధ్యాయులు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి కావాలి మనకు.

4. దయచేసి FA-4, SA-2, బైజూస్ పాఠాలు విద్యార్థులు కు అందించవలసిందిగా సూచించడం అయింది. 5. దయచేసి అందరూ మూడు వీడియోలు చూసి దానిలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు

ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన కార్యక్రమాలు తెలుసుకొని విద్యార్థులను నేర్చుకోవడం ప్రక్రియలో ప్రోత్సహించ వలసినదిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాను.

ఆల్ ది బెస్ట్.
ప్రవీణ్ ప్రకాష్ ప్రిన్సిపల్ సెక్రెటరీ

 Dear all,

The Third episode of the programme “From the Desk of Principal Secretary” will be streamed from the SCERT YouTube channel at 03.00 p.m , i.e., Thursday, 23rd February 2023. Request SCERT Director to share the link with all concerned. Request all HoDs and the senior field officers to share the information and ensure that everybody watches it. The main purpose of this program is to ensure that every person who is part of the School Education Department (Permanent, Contract or outsourcing) is on the same page as far as the implementation of flagship programs of the government is concerned.

This is the part of the new program called "From The Desk of Principal Secretary School Education". Request to login to the channel.Request HoDs ,and DEOs to forward this msg to all the Teachers ,HMs,and all other colleagues mentioned above
With regards
Praveen 

Download Telugu Matter in Pdf

Top Post Ad

Below Post Ad